లాక్ డౌన్ తర్వాత సినిమాలన్నీ ఒక్కొక్కటిగా సెట్స్ పైకి వస్తున్నాయి. కొత్త పెళ్లి కొడుకు నితిన్ కూడా సెట్స్ పైకి వచ్చాడు. Nithin హీరోగా నటిస్తున్న రంగ్ దే (RangDe) సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది.
అన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలతో ఈరోజు హైదరాబాద్ లో రంగ్ దే షూట్ మొదలుపెట్టారు. నితిన్ తో పాటు ఇతర నటీనటులంతా ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నారు.
సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా రంగ్ దే రిలీజ్ అవుతుందని ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు మేకర్స్.
కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.