వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్, ఇప్పుడు మరో సినిమాను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వక్కంతం వంశీతో కలిసి నితిన్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్. అదేంటంటే.. వక్కంతం వంశీ కేవలం కథ-స్క్రీన్ ప్లే వరకే పరిమితం అవుతాడా.. లేక నితిన్ ను డైరక్ట్ చేస్తాడా అనేది చిన్న సస్పెన్స్.
[caption id="attachment_172255" align="alignnone" width="650"]
వక్కంతం వంశీ[/caption]
అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ సినిమా రిజల్ట్.. బన్నీ కెరీర్ కే కాదు, వక్కంతం కెరీర్ కు కూడా గ్యాప్ ఇచ్చేసింది. బన్నీ వెంటనే కోలుకున్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వక్కంతం మాత్రం ఇప్పటివరకు దర్శకుడిగా మరో ఛాన్స్ అందుకోలేకపోయాడు.
ఇన్నాళ్లకు నితిన్ ను అతడు డైరక్ట్ చేసే అవకాశం ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం డిఫరెంట్ కథలు చేస్తున్న నితిన్, వక్కంతం చెప్పిన ఓ సరికొత్త పాయింట్ విని ఫిదా అయ్యాడట. ఫుల్ లెంగ్త్ లో స్టోరీ డెవలప్ చేస్తే కచ్చితంగా సినిమా చేస్తానని మాటిచ్చాడట. కాకపోతే ఇంతకుముందే చెప్పుకున్నట్టు వక్కంతం కు దర్శకుడిగా ఛాన్స్ ఇస్తాడా ఇవ్వడా అనేది చూడాలి
అయితే ప్రాజెక్టు ఓకే అయినా ఇప్పట్లో ఇది సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్నాడు నితిన్. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. దీని తర్వాత పవర్ పేట సినిమా చేయాలి. అది కాస్తా 2 పార్టుల్లో రాబోతోందనే టాక్ నడుస్తోంది. ఇవన్నీ కంప్లీట్ అయితే తప్ప వక్కంతం సినిమా పట్టాలపైకి వచ్చేలా లేదు. ఏమో.. నితిన్ ఒకేసారి 2 స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
- - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics