Nikhil’s ‘Karthikeya 2’ crossed $500k mark at the US Boxoffice

Wednesday,August 17,2022 - 12:57 by Z_CLU

నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి డైరెక్షన్ లో వచ్చిన 'కార్తికేయ 2' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా సప్రయిజింగ్ గా నార్త్ లో కూడా భారీ వసూళ్ళు రాబడుతోంది. అక్కడ  60 థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా మూడో రోజుకే 700 లకు పైగా థియేటర్స్ కి చేరుకుంది. డే బై డే నార్త్ లో థియేటర్స్ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 12 కోట్లకు పైగా షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో $500 మార్క్ దాటేసి 1 మిలియన్ వైపు దూసుకెళ్తోంది.

నార్త్ లో ఇప్పటికే దాదాపు  కోటిన్నర వరకూ నెట్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం టీం అక్కడ ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు. డిల్లీ , ముంబై సక్సెస్ టూర్స్ జరపనున్నారు. తాజాగా స్పెషల్ ఫ్లైట్ లో డిల్లీ బయలుదేరింది కార్తికేయ 2 టీం. ఆ తర్వాత ముంబై వెళ్లనున్నారు. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా తక్కువ థియేటర్స్ లో ఎక్కువ రెవెన్యూ రాబడుతున్న సినిమాగా కార్తికేయ బడా నిర్మాతలకు సైతం షాక్ ఇస్తోంది. ఇటివలే అల్లు అరవింద్ , దిల్ రాజు వంటి బడా నిర్మాతలు సినిమా టీం ను అభినందించి సినిమా రెవెన్యూ గురించి మీడియా ముందు మాట్లాడారు. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తోంది ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో వేచి చూడాలి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics