Naveen Polishetty’s new film announced

Wednesday,September 15,2021 - 03:54 by Z_CLU

బాలీవుడ్ లో 'చిచోరే' అనే సినిమాతో నటుడిగా పరిచయమైన నవీన్ పోలిశెట్టి తెలుగులో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో హీరోగా మారిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే హీరోగా విజయం అందుకొని తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న నవీన్ రెండో సినిమా 'జాతి రత్నాలు' తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో నుండి వచ్చే మూడో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. తాజాగా తన మూడో సినిమా ఎనౌన్స్ చేసి డీటెయిల్స్ చెప్పేశాడు నవీన్.

#NP3 అంటూ తన మూడో సినిమాను ప్రకటించాడు. కళ్యాణ్ శంకర్ అనే దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు నావీన్. ఈ సినిమా కూడా 'జాతిరత్నాలు' తరహాలోనే ఫుల్లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. సితార ఎంటర్టైనర్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా మరనుండడం విశేషం.

జాతిరత్నాలు తర్వాత యూ.వీ.క్రియేషన్స్ బేనర్ లో ఓ సినిమా సైన్ చేశాడు నవీన్. అనుష్క -నవీన్ కాంబినేషన్ లో ఆ సినిమా తెరకెక్కాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోయిందనే టాక్ వినబడుతుంది. ఇక తాజాగా సితార బేనర్ లో సినిమా ఎనౌన్స్ అవ్వడంతో నవీన్ ఆ సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చినట్టయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు మేకర్స్. కాస్టింగ్ తో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మరి ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్ కొడితే హీరోగా ఫుల్ బిజీ అవ్వడం ఖాయం.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics