Mythri Movie Makers back to back movies with stars

Saturday,June 12,2021 - 03:33 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ లో ఉన్న నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. మహేష్' శ్రీమంతుడు' సినిమాతో బేనర్ ను స్థాపించి తక్కువ టైంలోనే మంచి సక్సెస్ రేట్ తో టాప్ బేనర్ గా మైత్రి ని నిలబెట్టారు రవి , నవీన్ లు. అయితే ఈ బేనర్ ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్ట్స్ తో మరింత దూసుకెళ్తోంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో మహేష్ 'సర్కారు వారి పాట', బన్నీ 'పుష్ప' సినిమాలు ఏక కాలంలో తెరకెక్కుతున్నాయి. త్వరలోనే బాలయ్య తో సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఇవే కాకుండా మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. లైనప్ లో చిరంజీవి , ఎన్టీఆర్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

allu-arjun-pushpa-releases-august-13-zeecinemalu  

ఇక స్టార్ హీరోలతో నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఎక్కువ వర్క్ ఉంటుంది. ప్రొడక్షన్ నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఆ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా కథకి ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. మరి స్టార్ హీరోతో ఒక సినిమా నిర్మించడమే కష్టమవుతున్న ఈరోజుల్లో ఇలా వరుసగా బడా సినిమాలు నిర్మిస్తూ ఓ అరుదైన రికార్డు అందుకుంది మైత్రి.

mahesh sarkaru vaari paata

ఒక వైపు పెద్ద సినిమాలు నిర్మిస్తూనే మరో వైపు యంగ్ హీరోలతో మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ ముందు కెళ్తోంది. వచ్చే ఏడాది ఈ బేనర్ నుండి ఎటు లేదన్నా ఐదారు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ప్లానింగ్ ప్రకారం అన్నీ రిలీజ్ అయితే 2022 లో మైత్రి సంస్థ ఓ అరుదైన రికార్డు నెలకొలపనుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics