Megastar Chiranjeevi to increase speed with three films !

Saturday,November 13,2021 - 10:07 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి కొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. గతంలో ఏక కాలంలో మూడు నాలుగు సినిమాలు చేసినట్టే మళ్ళీ చేయబోతున్నారు.  'ఆచార్య'ని ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన చిరు ఇటివలే 'గాడ్ ఫాదర్' షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు తన నెక్స్ మెగా ప్రాజెక్ట్స్ ని కూడా లాంచ్ చేసేసి రెడీ టూ షూట్ అంటూ చెప్పేశారు.

బాబీ డైరెక్షన్ లో మెగా స్టార్ నటిస్తున్న సినిమా ఇటివలే ఘనంగా ప్రారంభమైంది. ఆ సినిమా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. తాజాగా మెహర్ రమేష్ తో చేయబోతున్న 'భోళా శంకర్' ని కూడా లాంచ్ చేశారు చిరు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే చిరు సరసన హీరోయిన్ గా తమన్నా అలాగే చెల్లెలి పాత్రకు కీర్తి సురేష్ ఎంపిక జరిగిపోయింది.

నిజానికి 'సైరా' రిలీజ్ తర్వాతే 'ఆచార్య' ను సెట్స్ పై పెట్టారు చిరు. ఇప్పుడు మాత్రం 'ఆచార్య' రిలీజ్ కంటే ముందే మూడు సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. వీటిలో ఒక సినిమా వచ్చే ఏడాది రావడం పక్కా అనిపిస్తుంది. వచ్చే ఏడాది ఆరంభంలో 'ఆచార్య' తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏడాది చివర్లో దసరా లేదా దీపావళి కి 'గాడ్ ఫాదర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారు చిరు. అలాగే 2023 సంక్రాంతి కి ఇంకో సినిమాను తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు. ఇలా వరుసగా మూడు సినిమాలు లైన్లో పెట్టి మెగా ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ తీసుకురాబోతున్నారు మెగాస్టార్.