Krithi Shetty Entered into Malayalam Movie Industry

Wednesday,October 12,2022 - 02:41 by Z_CLU

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైంది కృతి శెట్టి. ఆ సినిమా సక్సెస్ తో తెలుగులో ఆమెకు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికీ ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి. ఇదే క్రమంలో ఆమె కోలీవుడ్ లోకి కూడా ఎంటరైంది. రామ్ హీరోగా నటించిన వారియర్ సినిమా ఆమె తొలి తమిళ సినిమా అయింది. ఆ తర్వాత అక్కడ కూడా 2 సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీపై కూడా కన్నేసింది ఈ బ్యూటీ.

ఓ మలయాళం సినిమాతో కృతి షెట్టి హీరోయిన్ గా మల్లూవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'అజయంతే రందం మోషణం'. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారు.

'అజయంతే రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో కూడా విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా కథలో కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. అందుకే టోవినో ఇటీవల కలరి విద్యలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.