మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటైన 'KGF 2' సినిమా విడుదల వాయిదా పడిందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ ను మార్చారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లిందని అంటున్నారు. షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైం పట్టనుంది. అలాగే రిలీజ్ కి ముందు రెండు నెలలు గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. ఇప్పటికే మేకర్స్ జులై లో రిలీజ్ అంటూ ప్రకటించారు. అంటే ఈ లెక్కన మేకర్స్ లో చేతిలో ఉన్నదే రెండు నెలలు. అందులో పోస్ట్ ప్రొడక్షన్ పైగా ప్రమోషన్స్ అంటే కాస్త కష్టమే. చెప్పిన డేట్ కు రిలీజ్ అనుకుంటే లెక్కప్రకారం ఈపాటికి ప్రమోషన్ స్టార్ట్ అవ్వాలి.
సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండటంతో ఈ సీక్వెల్ పై బాలీవుడ్ లో మంచి హైప్ ఉంది. మొదటి పార్ట్ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టింది. ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ బాలీవుడ్ పై గట్టిగా పడింది. ఇప్పుడప్పుడే బాలీవుడ్ లో సినిమా రిలీజ్ చేసే అవకాశం లేదు. ఇవన్నీ కే.జీ.ఎఫ్ రిలీజ్ కి ముందున్న సమస్యలు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కూడా ఇంకా టైం కావాలి పైగా కరోనా ప్రభావం తగ్గాలి. అప్పుడే ఈ సినిమా థియేటర్స్ లో వస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ప్రశాంత్ డైరెక్షన్ లో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రవీనా టండర్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics