KGF Chapter 2 : Last Scedule held on Hyderabad

Wednesday,November 25,2020 - 01:26 by Z_CLU

యష్ నటించిన 'KGF' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రానున్న 'KGF Chapter 2' పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు నెలకొంటున్నాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న యూనిట్ ఇటివలే బెంగుళూరులో తిరిగి షూటింగ్ ప్రారంభించారు.

అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ప్రకాష్ రాజ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీసిన యూనిట్ చివరి షెడ్యుల్ ను హైదరాబాద్ లో చేయబోతున్నారు. రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీ సినిమాకు సంబంధించి మిగిలిన సన్నివేశాలను తీయనున్నారు. ఈ షెడ్యుల్ లో హీరో Yash తో పాటు సంజయ్ దత్ , మిగతా నటులు కూడా పాల్గొంటారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో Pan India సినిమాగా రానున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ మళ్ళీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే అధికారికంగా మరో డేట్ ను ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.