Huge Graphics in Prabhas’s RadheShyam Movie

Thursday,May 06,2021 - 01:55 by Z_CLU

రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. రియల్ లొకేషన్స్ లో తీస్తే బాగుంటుందని, కాస్త ఖర్చు పెట్టి మరీ యూరోప్ వెళ్లారు. మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే పూర్తిచేశారు. అయితే ఇప్పుడీ సినిమాకు గ్రాఫిక్స్ కోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నారట.

యూరోప్ బ్యాక్ గ్రౌండ్ కథతో, యూరోప్ లో తీసిన ఈ సినిమాకు మళ్లీ గ్రాఫిక్స్ ఎందుకనేది పెద్ద ప్రశ్న. సరిగ్గా ఇక్కడే కరోనా భూతం సమాధానంగా నిలుస్తోంది. అవును.. కరోనా వల్ల యూరోప్ లో తీయాల్సిన మరో షెడ్యూల్ రద్దయింది. ఇప్పట్లో యూరోప్ దేశాలకు వెళ్లే పరిస్థితి లేదు.

radheshyam ugadi special poster

దీంతో హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ వేసి, అందులో షూట్ చేసిన సన్నివేశాలకు భారీగా గ్రాఫిక్స్ యాడ్ చేసి, యూరోప్ ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం భారీగా ఖర్చుపెడుతున్నారు. నిజానికి ఈ గ్రాఫిక్స్ కోసం పెట్టే ఖర్చు కంటే, తక్కువ ఖర్చులోనే యూరోప్ వెళ్లి రావొచ్చు. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. గ్రాఫిక్స్ తప్పలేదు.

మొదట్నుంచి రాధేశ్యామ్ కు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. చివరికి ఫైనల్ షెడ్యూల్ కు కూడా ఇబ్బందులు తప్పలేదు. సెకెండ్ వేవ్ కారణంగా ఫిలింసిటీలో స్టార్ట్ చేసిన ఫైనల్ షెడ్యూల్ ఆగిపోయింది. ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కానీ, రాధేశ్యామ్ మూవీ కూడా చెప్పిన తేదీకి థియేటర్లలోకి రానట్టే.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జులై 30న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics