హీరో రాజశేఖర్, రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. ఆయన సక్సెస్ ఫుల్ గా కరోనాను జయించారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజశేఖర్.. నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.
తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించారు రాజశేఖర్. తనతో పాటు కుటుంబం మొత్తం వైరస్ బారిన పడినట్టు ఆయన తెలిపారు. అయితే రాజశేఖర్ ప్రకటన చేసే టైమ్ కే ఆయన కూతుళ్లు శివాని, శివాత్మిక కరోనా నుంచి కోలుకున్నారు.
[video width="640" height="352" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2020/11/rajasekhar-corona-11.mp4"][/video]
ఆ తర్వాత కొన్ని రోజులకు రాజశేఖర్ భార్య జీవిత కూడా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇన్నాళ్లకు రాజశేఖర్ కూడా సక్సెస్ ఫుల్ గా కరోనా నుంచి బయటపడ్డారు.
హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు రాజశేఖర్ హెల్త్ కండిషన్ పై చాలా పుకార్లు వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచారని రూమర్స్ వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు జీవిత ఖండిస్తూ వచ్చారు.
Rajasekhar డిశ్చార్జ్ అవ్వడంతో.. ఇన్నాళ్లూ అతడిపై వచ్చిన Corona పుకార్లకు చెక్ పడింది. మరికొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని, ఫిజికల్ గా ఫిట్ గా తయారైన తర్వాత నీలకంఠ (Neelakanta) దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తారు రాజశేఖర్.