Hero Prabhas very busy with ‘Radheshyam’ Promotions

Monday,March 07,2022 - 05:10 by Z_CLU

ప్రభాస్ , పూజ హెగ్డే కాంబినేషన్ లో రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన 'రాధేశ్యామ్' రిలీజ్ కి రెడీ అయింది. మార్చ్ 11న ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజవుతోంది. రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులే ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు ప్రభాస్. రెండ్రోజులుగా తెలుగు టివీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రభాస్ అండ్ టీం తాజాగా హైదరాబాద్ లో తెలుగు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టారు.

ఈ ఈవెంట్ లో ప్రభాస్ తో పాటు దర్శకుడు రాధా కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ , తమన్ హాజరయ్యారు. ముంబై ఈవెంట్ తో రాధేశ్యామ్ ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు ప్రభాస్. ముంబై మీడియాకి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడి నుండి టీంతో చెన్నై వెళ్ళాడు.

ఇప్పుడు హైదరాబాద్ లో తెలుగు మీడియా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్.  ప్రెజెంట్ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఆన్లైన్ లో ఇప్పటికే భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. 'సాహో' తర్వాత కొంత గ్యాప్ తో వస్తున్న ప్రభాస్ సినిమా కావడంతో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ భారీ హైప్ తో ప్రభాస్ మొదటి రోజు ఎలాంటి వసూళ్ళు రాబడతాడో అని ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. గోపికృష్ణా మూవీస్ పై కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది.