Director Parasuram gives clarity on his next film

Wednesday,May 18,2022 - 01:10 by Z_CLU

మీడియం రేంజ్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇప్పుడు మహేష్ 'సర్కారు వారి పాట' స్టార్ డైరెక్టర్స్ కేటగిరీలోకి చేరిపోయాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సక్సెస్ తో జోష్ మీదున్న ఈ దర్శకుడు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అనే డౌట్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు పరశురాం.

అక్కినేని నాగచైతన్య తో 'నాగేశ్వరరావు' సినిమా చేస్తానని చెప్పాడు. కాకపోతే ఇప్పుడే దాని గురించి ఏం చెప్పలేనని ప్రస్తుతం సర్కారు సక్సెస్ నుండి బయటికొచ్చాకే ఆ సినిమా గురించి ఆలోచిస్తానని తెలిపాడు. కానీ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లాక్ అయిందని మిగతా పనులు మొదలు పెట్టాలని అన్నాడు.

మహేష్ తో 'సర్కారు వారి పాట' కంటే ముందు పరశురాం నాగ చైతన్య తో 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు సినిమా ఎనౌన్స్ చేశారు. #NC20 గా ప్రకటించి రెడీ టూ షూట్ వరకూ ఆ సినిమా కదిలింది. కానీ ఉన్నపళంగా మహేష్ నుండి కాల్ రావడం, సర్కారు వారి పాట స్క్రిప్ట్ ఒకే అవ్వడంతో వెంటనే చైతూ ని , నిర్మాతలను కన్విన్స్ చేసి ఆ సినిమా పక్కన పెట్టి బయటికొచ్చాడు పరశురాం. ఇప్పుడు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ కాంబో సినిమా గురించి డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics