Director Krish about Pawan’s Hari Hara VeeraMallu
Monday,October 04,2021 - 04:24 by Z_CLU
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ భారీ ప్రాజెక్ట్ 'హరి హర వీర మల్లు' గురించి అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు క్రిష్. ఇటీవలే 'కొండ పొలం' ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన క్రిష్ పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న సినిమా సగం వరకూ పూర్తయింది. ఒక్క సీన్ చేస్తే ఇంటర్వెల్ వరకు కంప్లీట్ అయినట్టే. నవంబర్ నుండి నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కానుందని తెలిపాడు.
కోవిడ్ 1st వేవ్ తర్వాత డైరెక్టర్స్ మీట్ లో 'కొండపొలం' నవలను సుకుమార్, ఇంద్ర గంటి మోహన కృష్ణ ఇద్దరూ చదవమని చెప్పారని. లక్కీ గా మా ఇంట్లో నా బుక్స్ లో అది ఉందని చదివాక సినిమాగా మాలిచే ఆలోచన వచ్చిందని చెప్పాడు.
ఇక 'గౌతమి శాతకర్ణి' తర్వాత కేశవ రెడ్డి గారి రాసిన 'అతడు అడవిని జయించాడు' అనే కథను తీసుకొని హీరో వెంకటేష్ గారితో చేయాలనుకున్నానని, కానీ కుదరలేదని అన్నారు. ఆ కథను తనికెళ్ల భరణి గారు నాకు రెఫర్ చేసారని చెప్పుకున్నాడు. మరి సన్నపరెడ్డి వెంకట రామిరెడ్డి రచించిన కొండ పొలం కథతో దర్శకుడు క్రిష్ విజయం అందుకుంటే ఇలాంటి మరిన్ని కథలను ఆయన ఎంచుకొని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే దారిలో మరికొందరు దర్శకులు కూడా పయనించి మన తెలుగు కథలకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చే ఆలోచన మొదలవుతుంది.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics