మోహన్ రాజా డైరెక్షన్ లో మళయాలం బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఆగస్ట్ 13 నుండి సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఇప్పటికే షెడ్యుల్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జైలు సెట్ వేస్తున్నారు.
ఆ సెట్ లో ముందుగా చిరంజీవిపై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారని సమాచారం. సినిమాకు మిగతా కాస్టింగ్ కూడా ఫైనల్ అవ్వాల్సి ఉంది. ముఖ్యంగా హీరోయిన్ , విలన్ పాత్రలకు ఇంకా ఆర్టిస్టులను సెలెక్ట్ చేయలేదు. ప్రస్తుతం దర్శక నిర్మాత అదే పనిలో ఉన్నారు. హీరోయిన్ గా నయనతార ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అలాగే విలన్ గా కోలీవుడ్ నటుడిని ఎంపిక చేసే ప్లానింగ్ లో ఉన్నాడు దర్శకుడు.
ఆగస్ట్ 13 నుండి మొదలు కానున్న ఈ షెడ్యుల్ ఓ 10 రోజుల వరకు జరగనుంది. ఆ తర్వాత హైదరబాద్ లోనే గ్యాప్ ఇచ్చి మిగతా షెడ్యుల్స్ ఫినిష్ చేస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటివలే తమన్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టాడు మోహన్ రాజా. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు లక్ష్మీ భూపాల మాటలు అందిస్తున్నారు.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హీరో సత్యదేవ్ ను ఇప్పటికే ఎంపిక చేశారు. సినిమాలో చిరంజీవి అనుచరుడిగా కనిపించబోతున్నాడు సత్యదేవ్. త్వరలోనే లూసిఫర్ షూట్ లో జాయిన్ అవుతానని, చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే తన కలను నెరవేర్చుకుంటానని అంటన్నాడు సత్యదేవ్.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇప్పటికే 3 సాంగ్స్ ను ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా యాక్షన్ ఎపిసోడ్స్ తో షూట్ స్టార్ట్ చేసి, తర్వాత సాంగ్స్ కు షిఫ్ట్ అవుతారు. ఈ సినిమా మొత్తాన్ని ఇండియాలోనే పూర్తిచేసేలా ప్లాన్ చేశారు. ఎలాంటి ఫారిన్ షెడ్యూల్స్ పెట్టుకోకూడదని అనుకుంటున్నారు.
- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics