మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
రీసెంట్గా ఈ సినిమా విడుదలై సూపర్సక్సెస్ని సాధించిన విషయం తెలిసిందే. ఓ జంట ప్రేమప్రయాణానికి అద్భుతమైన దృశ్యరూపంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ఒక హైలెట్గా నిలిచింది.
ఈ సందర్భంగా రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్కి ఒక మ్యూజికల్ గిఫ్ట్తో పాటు ఒక లేఖని పంపారు.