ANR’s Yedanthasthula Meda Movie Completes 40 Years

Monday,January 11,2021 - 11:22 by Z_CLU

నాగేశ్వరరావు తన నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. అందులో ‘ఏడంతస్తుల మేడ’ ఒకటి. దర్శక రత్న దాసరినారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1980, జనవరి 11న విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. సరిగ్గా నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఏఎన్నార్ తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు.

దాసరి, అక్కినేని అక్కినేని కాంబినేషన్ అంటేనే అప్పట్లో యమ క్రేజ్...ఈ కాంబోలో వచ్చిన నాలుగవ చిత్రమే ఏడంత స్తుల మేడ.. సంక్రాంతి సీజన్ లో వచ్చి సూపర్ హిట్ సాధించింది. సుజాత, జయసుధ పోటీపడి నటించిన ఈ చిత్రానికి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు..కొన్ని ప్రత్యేక షోలు మహిళల కోసమే వేశారు అంటే ఈ చిత్రానికి వున్న డిమాండ్ ఏమిటో అర్థం అవుతుంది...

సుజాత, జయసుధ .జగ్గయ్య, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా కేవలం 50 రోజులకే ఒక కోటీ ఇరవై లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. అప్పట్లో అక్కినేని స్టామినా ఏంటో చాటిచెప్పింది. ఒక పేదవాడు కోటిశ్వరుడైతే.. ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చాటి చెప్పే కథతో మలచిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.

ఝాన్సీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై వై. అరుణ్ ప్రసన్న నిర్మించిన ఈ సినిమా ను ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా.. అక్కినేని నాగార్జున తో రీమేక్ చేయాలని కొందరు దర్శకులు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. ఏదేమైనా ‘ఏడంతాస్తుల మేడ’ చిత్రం హీరోగా.. అక్కినేని నాగేశ్వరరావు కే కాకుండా.. దర్శకుడిగా దాసరి కి కూడా ఒక మరిచిపోలేని చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.