Anasuya gives clarity on ‘SilkSmita’ biopic!

Wednesday,December 09,2020 - 04:23 by Z_CLU

యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. 'రంగస్థలం' తర్వాత రంగమ్మత్త గా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకుంది. తాజాగా అనసూయ అద్దంలో చూసుకుంటూ ఓ ఫోటో పెట్టి తమిళ్ లో ఓ మంచి సినిమా చేస్తున్నాని తెలిపింది. అంతే కాదు సినిమాలో ఆ గెటప్ కి సిల్క్ స్మిత రెఫరెన్స్  తీసుకున్నట్లు చెప్పుకుంది. దీంతో ఆమె తమిళ్ లో సిల్క్ స్మిత బయోపిక్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది.  విషయం తెలుసుకున్న అనసూయ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.

తను ఏ బయోపిక్ లోనూ సిల్క్ స్మితగా నటించడం లేదని అనసూయ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ ట్వీట్ తో అనసూయ హీరోయిన్ గా  తమిళ్ లో 'సిల్క్ స్మిత' బయోపిక్ అనే ప్రచారానికి ఫులిస్టాప్ పడింది. ప్రస్తుతం అనసూయ చిరంజీవి 'ఆచార్య' అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలతో పాటు రవితేజ 'కిలాడీ' లో నటిస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కమిట్ అయ్యింది.