Allu Arjun reached Rajahmundry for Pushpa Shoot

Sunday,November 08,2020 - 01:40 by Z_CLU

ఎట్టకేలకు పుష్ప మూవీ సెట్స్ పైకి రాబోతోంది. లాక్ డౌన్ కు ముందే ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, మళ్లీ ఇన్నాళ్లకు సెట్స్ పైకి రాబోతోంది. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు లేదా రేపట్నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఆల్రెడీ బన్నీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్నాడు. నెల రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ తో పాటు ఫైట్స్ కూడా తెరకెక్కించబోతున్నారు.

మూవీకి సంబంధించి కేరళలో టోటల్ సెటప్ రెడీ చేసుకున్నారు. కొంత షూటింగ్ కూడా చేశారు. ఇక బన్నీ సెట్స్ పైకి వస్తాడనగా కరోనా రావడంతో మూవీ షూట్ నిలిచిపోయింది. మరోసారి కేరళ వెళ్లడం ఇష్టంలేక మారేడుమిల్లి ఫిక్స్ చేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. ఆమె ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Check - పుష్ప కోసం అంతా రెడీ