Actress Manjima Mohan opens up her relationship with Gowtham Karthik !

Tuesday,November 01,2022 - 03:38 by Z_CLU

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మంజిమా మోహన్ తన రిలేషన్ షిప్ విషయం బయటపెట్టింది. అలనాటి హీరో కార్తి కొడుకు గౌతం కార్తిక్ తో కొంత కాలంగా మంజిమా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని తాజాగా ఇద్దరూ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తమ ప్రేమ సంగతి బయటపెట్టారు.

ఒకరికొకరు తమ జీవితంలో వచ్చిన మార్పును, ప్రేమలో పడిన తర్వాత పొందిన సంతోషాన్ని తెలుపుతూ ఎమోషనల్ నోట్ ద్వారా ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో చెప్పుకునే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో కార్తిక్ , మంజిమా మోహన్ ఫోటోలతో పాటు పెట్టిన  పోస్టులు వైరల్ అవుతున్నాయి. మంజిమా మోహన్ మలయాళం , తమిళ్ సినిమాలతో పాటు తెలుగులో నాగ చైతన్య  'సాహసం శ్వాసగా సాగిపో'  అలాగే 'ఎన్టీఆర్ కథానాయకుడు' , 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'అక్టోబర్ 31స్ట్ లేడీస్ నైట్' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తమిళ్ , తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది.

మణిరత్నం 'కాదల్' సినిమాతో హీరోగా పరిచయమైన గౌతం కార్తిక్  ప్రస్తుతం తమిళ్ లో బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics