ఎవిరీ ఇయర్ టాలీవుడ్లో కొందరు ప్రముఖులు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. వారికి సంబంధించిన వార్తలే కనిపిస్తూ ట్రెండింగ్ లో ఉంటూ హాట్ టాపిక్ అవుతుంటారు. అలా ఈ ఏడాది హాట్ టాపిక్ గా నిలిచి సెన్సేషన్ అయిన కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.
సమంత - చైతు విడాకులు:
ఈ ఇయర్ టాలీవుడ్ ఆడియన్స్ కి అతి పెద్ద సెన్సేషనల్ న్యూస్ అంటే అది సమంత- చైతూ విడాకులే. పెళ్లి తర్వాత అందరికీ ఫేవరేట్ కపుల్ గా మారిన ఈ ఇద్దరు ఈ ఏడాది విడాకులు తీసుకోవడంతో సమంత మీడియాలో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. దాదాపు ఆ నెలంతా సమంత విడాకుల టాపిక్కే నడిచింది. ఇక 'పుష్ప' లో "ఊ అంటావా మావ ఊ ఊ అంటావా" అనే స్పెషల్ సాంగ్ తో కూడా సామ్ హాట్ టాపిక్ గా అయింది. ఇప్పటి వరకూ సమంత ఇలాంటి పాటల్లో డాన్స్ చేయకపోవడంతో ఒక్కసారిగా సాంగ్ తో సెన్సేషన్ అయింది.
నాటు నాటు స్టెప్ :
RRR నుండి అప్పటి వరకూ రిలీజ్ అయిన కంటెంట్ ఒకెత్తు 'నాటు నాటు' సాంగ్ ఒకెత్తు. అవును ఇలా లిరికల్ వీడియో రిలీజ్ చేసి ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్పీడ్ గా వేసిన స్టెప్స్ తాలూకు క్లిప్స్ వదిలారో అక్కడి నుండి సాంగ్ లో తారక్ , చరణ్ వేసిన స్టెప్ సెన్సేషన్ అయిపోయింది. సాంగ్ రిలీజ్ అయిన క్షణం నుండే అందరూ ఈ స్టెప్ వేస్తూ హల్చల్ చేశారు. ట్రైలర్ కంటే ముందు RRR సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది సాంగ్ అందులో స్టెప్.
రాధేశ్యామ్ ట్రైలర్ :
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని ఎప్పటికప్పుడు తన క్రేజే చెప్తుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలానే భారీ రికార్డు వ్యూస్ కొల్లగొట్టి సెన్సేషనల్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు ప్రభాస్. 'రాధే శ్యామ్' ట్రైలర్ భారీ స్థాయిలో వ్యూస్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ రేంజ్ వ్యూస్ మరో ట్రైలర్ కి రాకపోవడంతో ప్రభాస్ మరోసారి సెన్సేషన్ అయ్యాడు.
అల్లు అర్జున్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సెన్సేషనల్ స్టార్ అనిపించుకున్నాడు. దానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ చిన్న సినిమాల ఫంక్షన్ లో ఎక్కువగా కనిపిస్తూ హాట్ టాపిక్ అయ్యాడు బన్నీ. అంతే కాదు ఎక్కడకి వెళ్ళినా తన మేనరిజమ్ తో తగ్గేదే లే అంటూ డైలాగ్ చెప్తూ ఎట్రాక్ట్ చేశాడు. ఓవరాల్ గా ఈ ఏడాది భారీ హిట్ అందుకొని కలెక్షన్స్ పరంగానూ సెన్సేషన్ అయ్యాడు.
"సారంగ దరియా" సాంగ్ :
ఈ ఏడాది తన డాన్సింగ్ టాలెంట్ తో మెస్మరైజ్ చేసి 'సారంగ దరియా' సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సాయి పల్లవి. రిలీజ్ కి ముందు మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ థియేటర్స్ కి ఆడియన్స్ ని తీసుకొచ్చేలా చేసింది. దీంతో యూ ట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. ఈ ఏడాది ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తూ సాయి పల్లవే కనిపిస్తూ హాట్ టాపిక్ అయింది.
'మా' ఎలక్షన్స్
ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు జరిగాయి. మూడు నెలల ముందు నుండే డిబేట్లు , ఇంటర్వ్యూలు ఇలా ప్రమోషన్ యాక్టివిటీస్ మొదలయ్యే సరికి ఒక్కసారిగా మంచు విష్ణు హైలైట్ అయ్యాడు. ప్రకాష్ రాజ్ పై మెజారిటీ వోట్లు సాధించి ఫైనల్ గా మా ప్రెసిడెంట్ అనే కిరీటం దక్కించుకున్నాడు. ఎలక్షన్స్ కి ముందు తర్వాత కూడా విష్ణు హాట్ టాపిక్ గా ఉంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు.
కీర్తి శెట్టి :
ఈ ఇయర్ బెస్ట్ డెబ్యూ అనిపించుకున్న కీర్తి శెట్టి ఉప్పెన సినిమా రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకొని వరుస సినిమాల్లో నటిస్తూ సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకుంది. ఉప్పెన తర్వాత క్రేజ్ మరింత పెంచుకొని క్రేజీ స్టార్ అనిపించుకుంది.
సిద్ శ్రీరామ్ :
ఈ ఇయర్ ఎక్కడ విన్నా సిద్ శ్రీరామ్ పాటలే ఎక్కువగా వినిపించాయి. ఒకటా రెండా పదుల సంఖ్యలో పాటలు పాడి ఈ ఏడాది సెన్సేషనల్ సింగర్ గా నిలిచాడు సిద్. చిన్నా పెద్దా తేడా లేకుండా వరుస సినిమాల పాటలతో హల్చల్ చేస్తూ వచ్చాడు. యూ ట్యూబ్ లో కూడా తన పాటలతో హంగామా చేశాడు.
మొగిలయ్య
ఒక సింగర్ కి ఏదైనా పెద్ద అవకాశం వస్తే అందరూ అతని వంక చూడటం కామనే. ఈ ఏడాది భీమ్లా నాయక్ తో అదే జరిగింది. సినిమా టైటిల్ సాంగ్ లో పాడేందుకు కిన్నెర మొగిలయ్య కి అవకాశం ఇచ్చారు. దీంతో ఈ సాంగ్ తో సెన్సేషన్ అయ్యారు కళాకారుడు మొగిలయ్య.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics