సెకండ్ వేవ్ తర్వాత అన్ని సినిమా ఇండస్ట్రీస్ కంటే ముందు పికప్ అయిన ఏకైక ఇండస్ట్రీ తెలుగు సినిమా మాత్రమే. 'క్రాక్' నుండి బాక్సాఫీస్ దగ్గర మొదలైన కలెక్షన్ల జాతర 'పుష్ప' వరకూ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ మధ్యలో కొన్ని సినిమాలు హిట్లు , మరికొన్ని సూపర్ హిట్లు అవ్వగా ఇంకొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఓవరాల్ రిపోర్ట్ చూస్తే మాత్రం బాలయ్య , బన్నీ లదే పై చెయి సాధించారు.
ఈ ఏడాది 'క్రాక్' తో ఓపెన్ అయిన టాలీవుడ్ మార్కెట్ 'పుష్ప'తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. డిసెంబర్ 17న విడుదలైన 'పుష్ప'... కలెక్షన్స్ తో అన్ని ఇండస్ట్రీస్ టాలీవుడ్ వైపుకి చూసేలా చేసింది. పుష్ప రాజ్ గా బన్నీ యాక్టింగ్ , సుకుమార్ టేకింగ్ , కథ -కథనం అన్ని కలిసి సినిమాను ఆడియన్స్ కి బాగా దగ్గర చేశాయి. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప కలెక్షన్స్ సునామి సృష్టించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అలవోకగా 2 మిలియన్ డాలర్ అందుకుంది. ఇది నిజంగా గొప్పగా చెప్పుకోవాల్సిన నంబరే. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఒక తెలుగు సినిమా అక్కడ ఈ స్థాయిలో కలెక్ట్ చేయడం విశేషమే. ఈ ఏడాది బెస్ట్ గ్రాసర్ గా నిలిచి అన్ని భాషల్లో షాకింగ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.
మాస్ ఆడియన్స్ కి ఈ ఇయర్ 'క్రాక్' తో మంచి బిర్యానీ అందింది. కానీ 'అఖండ'తో దానికి రెండింతలు ఎక్కువ అందడంతో సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మేజిక్ క్రియేట్ చేసింది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ కి తిరుగే లేదని మరోసారి నిరూపించిన సినిమాగా 'అఖండ' నిలిచిపోయింది. తెలుగు స్టేట్స్ లో అన్ని ఏరియాల్లో మంచి వసూళ్ళు రాబట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే బాగా పెర్ఫాం చేసింది. ఫైనల్ గా అక్కడ మిలియన్ మార్క్ దాటేసింది. దీంతో మూడో వారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ఎంటర్ అయింది.
నిజానికి పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' కూడా బాగానే కలెక్ట్ చేసింది కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం ఆశించిన రెవెన్యూ అందుకోలేకపోయింది. ఫైనల్ డీసెంట్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. 'ఉప్పెన', 'జాతిరత్నాలు' లాంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. కానీ 2021 ఇయర్ ఫైనల్ రౌండప్ చూస్తే మాత్రం అగ్ర హీరోల్లో బాలయ్య , బన్నీ లు పై చేయి సాధించి అదరగొట్టేసాడు.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics