Vishnu Manchu

Tuesday,November 24,2020 - 01:00 by Z_CLU

మంచు విష్ణు ప్రముఖ కథానాయకుడు. నవంబర్ 23 న జన్మించారు. విష్ణు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా 'రగిలే గుండెలు' సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యారు . 'విష్ణు' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత 'సూర్యం','అస్త్రం','గేమ్' సినిమాలతో కథానాయకుడిగా నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కిన 'డీ' సినిమాతో కథానాయకుడిగా మంచి అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 'కృష్ణార్జున' సినిమా చేసారు. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్య పాత్రలో నటించారు. తరువాత 'సలీం','వస్తాడు నా రాజు','దేనికైనా రెడీ','దూసుకెళ్తా','పాండవులు పాండవులు తుమ్మెద', 'రౌడీ', 'అనుక్షణం', 'ఎర్ర బస్సు','డైనమైట్','ఈడో రకం-ఆడో రకం', 'లక్కున్నోడు' సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ప్రస్తుతం అటు హీరోగా ఇటు నిర్మాతగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Related News