Rashmika Mandanna

Sunday,November 08,2020 - 01:06 by Z_CLU

రష్మిక మందన్న ప్రముఖ కథానాయిక. 'కిరిక్ పార్టీ' సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత 'అంజని పుత్ర', 'చమక్' వంటి కన్నడ సినిమాల్లో నటించింది. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు చేసింది. రీసెంట్ గా మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ కన్నడ బ్యూటీ.

Related News