Radha Krishna Kumar

Wednesday,March 02,2022 - 12:15 by Z_CLU

రాధాకృష్ణకుమార్ జిల్ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. అంతకంటే ముందు ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు. గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో స్టయిలిష్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా తన రెండో సినిమాకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. అదే రాధేశ్యామ్ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 11న థియేటర్లలోకి వస్తోంది.