GunaSekhar

Monday,November 30,2020 - 01:11 by Z_CLU

గుణ శేఖర్ ప్రముఖ రచయిత, దర్శకుడు.  1992 లో ప్రశాంత్ హీరోగా తెరకెక్కిన ' లాఠీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'సొగసు చూడతరమా','బాల రామాయణం' సినిమాలకు దర్శకత్వం వహించారు. మూడు సినిమాల తర్వాత మెగా స్టార్ చిరంజీవితో చేసిన నాలుగో సినిమా 'చూడాలని ఉంది' సినిమా ఘన విజయం సాధించి దర్శకుడిగా గుణ శేఖర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత'మనోహరం','మృగరాజు',ఒక్కడు','అర్జున్','సైనికుడు',వరుడు','నిప్పు',రుద్రమదేవి' సినిమాలకు దర్శకత్వం వహించారు. మహేష్ చేసిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గుణ శేఖర్ కి ప్రశంసలు అందించింది.