Aadhi Pinishetty

Thursday,December 17,2020 - 02:46 by Z_CLU

ఆది పినిశెట్టి తెలుగు-తమిళ నటుడు. ఆది ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు. తేజ దర్శకత్వం వహించిన 'ఒక వి చిత్రం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత 'మిఱుగం' సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణంలో తెరకెక్కిన 'యీరం' సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఆ తర్వాత తమిళ్ లో 'ఆడు పులి', 'అరవాన్', 'వల్లినం' వంటి పలు సినిమాల్లో నటించాడు.

తెలుగులో గుండెల్లో గోదారి', 'మలుపు', 'సరైనోడు' వంటి సినిమాలతో గుర్తింపు అందుకున్నాడు. సరైనోడులో విలన్ గా నటించి మెప్పించాడు. నిన్నుకోరిలో చేసిన సాఫ్ట్ రోల్ తో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కేవలం హీరో రోల్స్ కు మాత్రమే ఫిక్స్ అవ్వకుండా.. మంచి పాత్రలు చేస్తూ, విలక్షణ నటుడిగా దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి.