ఓంకార్

Monday,November 28,2016 - 11:48 by Z_CLU

ఓంకార్ ప్రముఖ దర్శకుడు. తొలుత ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా బుల్లి తెర కు యాంకర్ గా పరిచయం అయ్యారు. తరువాత ‘ఆట’,’మాయాద్వీపం’,’ఛాలెంజ్’ వంటి ప్రోగ్రాం లతో యాంకర్ గా, ప్రోగ్రాం డైరెక్టర్ గా బుల్లి తెర పై గుర్తింపు అందుకున్నారు. ‘జీనియస్’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ఓంకార్ ‘రాజు గారి గది’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయం అందుకొని భారీ కలెక్షన్స్ సాధించి దర్శకుడిగా ఓంకార్ కు గొప్ప గుర్తింపు అందించింది. ప్రస్తుతం ఓంకార్ నాగార్జున కథానాయకుడిగా ‘రాజు గారి గది 2’ ను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు