క్రిష్

Thursday,November 10,2016 - 04:00 by Z_CLU

రాధాకృష్ణ జాగర్లమూడి నవంబర్ 10 , 1977 లో జన్మించారు. ‘గమ్యం’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రం తో దర్శకుడిగా గుర్తింపు తో పాటు 2008 సంవత్సరం కు గాను బెస్ట్ డైరెక్టర్ కేటగిరి లో నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు ను అందుకున్నారు. ఆ తరువాత ‘వేదం’ , ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి విభిన్న చిత్రాలతో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. ‘వేదం’ సినిమాను ‘వానం’ పేరో తో రీమేక్ చేసి కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు క్రిష్. ఆ తరువాత తమిళ చిత్రం ‘రామన్న’ సినిమాను అక్షయ్ కుమార్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు.

    తాజాగా వరుణ్ తేజ్ తో ‘కంచె’ చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్ ఈ చిత్రం తో ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి లో నేషనల్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం క్రిష్ నందమూరి బాలకృష్ణ తో చారిత్రాత్మక చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ను తెరకెక్కిస్తున్నారు..

Born : November 10, 1977

సంబంధిత వార్తలు